దుబాయ్లో షూటింగ్ జరుపుకోనున్న 'సాహో'
- June 24, 2017
‘బాహుబలి’ హ్యాంగోవర్ నుంచి ప్రభాస్ బయటికొచ్చేశారు. ప్రస్తుతం చేస్తున్న ‘సాహో’లో పూర్తిగా లీనమైపోయారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. మరో షెడ్యూల్ కోసం ఈ యూనిట్ దుబాయ్ వెళ్లనుందట.
ప్రపంచంలో అత్యంత ఎల్తైన భవనం అయిన అక్కడి బుర్జ్ ఖలీఫా పరిసర ప్రాంతాల్లో ప్రభాస్, విలన్ నీల్ నితిన్ముఖేష్లపై హాలీవుడ్ లెవల్లో యాక్షన్ సీన్స్ తీయనున్నారని సమాచారం. ఇంకా పలు కీలక సన్నివేశాలను తీయడానికి కూడా ప్లాన్ చేశారట. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ఇంకా కథానాయిక ఫైనలైజ్ కాలేదు. టాలీవుడ్ తారలతో పాటు పలువురు బాలీవుడ్ నాయికల పేర్లను పరిశీలిస్తున్నారని భోగట్టా.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







