కొత్త తరహా సైబర్‌ ఎటాక్స్‌పై హెచ్చరిక

- June 24, 2017 , by Maagulf
కొత్త తరహా సైబర్‌ ఎటాక్స్‌పై హెచ్చరిక

బహ్రెయిన్‌: బహ్రెయిన్‌లో సోషల్‌ మీడియా వినియోగదారులపై ఎటాక్‌ చేస్తోన్న సైబర్‌ దాడులపై సైబర్‌ సెక్యూరిటీ అథారిటీస్‌ హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ యాంటీ కరప్షన్‌ అండ్‌ ఎకనమిక్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ వర్గాలు మాట్లాడుతూ, మల్టిపుల్‌ హ్యాకింగ్‌ అటెంప్ట్స్‌ని ఈ మధ్యకాలంలో గుర్తించామనీ సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్‌ ద్వారా ఈ దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నాయి.యాంటీ కర్ప్షన్‌ అండ్‌ ఎకనమిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ జనరల్‌ డైరెక్టర్‌ కల్నల్‌ బస్సామ్‌ అల్‌ మిరాజ్‌, ఇంటర్నెట్‌ వినియోగదారులు ఇలాంటి దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయరాదని, అలాంటి వాటి వివరాల్ని సైబర్‌ సెక్యూరిటీకి అందజేయాలని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com