ట్రీట్మెంట్ కోసం ఇండియాకి 90 మంది యెమనీలు
- June 24, 2017
న్యూఢిల్లీ: రెండో బ్యాచ్ యెమనీ పేషెంట్లు, ఇండియాకి చేరుకున్నారు. గత కొంతకాలంగా యెమెన్లో యుద్ధ వాతావరణం కారణంగా పెద్ద సంఖ్యలో సామాన్యులు గాయపడ్తున్నారు. మానవీయ కోణంలో యూఏఈ నాయకత్వం అలాంటివారికి వైద్య చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు బాధితుల్ని వైద్య చికిత్స కోసం తరలిస్తున్నారు. తాజా ఘటనలో 90 మంది పేషెంట్లు, ఇండియా రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానం దిగగానే వారిని ఆయా ఆసుపత్రులకు తరలించేందుకోసం ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. విపిఎస్ రాక్లాండ్ హాస్పిటల్స్ కార్పొరేట్ డైరెక్టర్ డాక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 39 అంబులెన్సులు ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రులకు బాధితుల్ని తరలించాయని చెప్పారు. ఎయిర్పోర్ట్ అలాగే ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ మేరకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారాయన. పేషెంట్లలో కొందరికి తగిలిన గాయాలు ఇన్ఫెక్షన్కి గురయినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









