ట్రీట్మెంట్ కోసం ఇండియాకి 90 మంది యెమనీలు
- June 24, 2017
న్యూఢిల్లీ: రెండో బ్యాచ్ యెమనీ పేషెంట్లు, ఇండియాకి చేరుకున్నారు. గత కొంతకాలంగా యెమెన్లో యుద్ధ వాతావరణం కారణంగా పెద్ద సంఖ్యలో సామాన్యులు గాయపడ్తున్నారు. మానవీయ కోణంలో యూఏఈ నాయకత్వం అలాంటివారికి వైద్య చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు బాధితుల్ని వైద్య చికిత్స కోసం తరలిస్తున్నారు. తాజా ఘటనలో 90 మంది పేషెంట్లు, ఇండియా రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానం దిగగానే వారిని ఆయా ఆసుపత్రులకు తరలించేందుకోసం ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. విపిఎస్ రాక్లాండ్ హాస్పిటల్స్ కార్పొరేట్ డైరెక్టర్ డాక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 39 అంబులెన్సులు ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రులకు బాధితుల్ని తరలించాయని చెప్పారు. ఎయిర్పోర్ట్ అలాగే ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ మేరకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారాయన. పేషెంట్లలో కొందరికి తగిలిన గాయాలు ఇన్ఫెక్షన్కి గురయినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









