ట్రీట్మెంట్ కోసం ఇండియాకి 90 మంది యెమనీలు
- June 24, 2017
న్యూఢిల్లీ: రెండో బ్యాచ్ యెమనీ పేషెంట్లు, ఇండియాకి చేరుకున్నారు. గత కొంతకాలంగా యెమెన్లో యుద్ధ వాతావరణం కారణంగా పెద్ద సంఖ్యలో సామాన్యులు గాయపడ్తున్నారు. మానవీయ కోణంలో యూఏఈ నాయకత్వం అలాంటివారికి వైద్య చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు బాధితుల్ని వైద్య చికిత్స కోసం తరలిస్తున్నారు. తాజా ఘటనలో 90 మంది పేషెంట్లు, ఇండియా రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. విమానం దిగగానే వారిని ఆయా ఆసుపత్రులకు తరలించేందుకోసం ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. విపిఎస్ రాక్లాండ్ హాస్పిటల్స్ కార్పొరేట్ డైరెక్టర్ డాక్టర్ వివేక్ సింగ్ మాట్లాడుతూ 39 అంబులెన్సులు ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రులకు బాధితుల్ని తరలించాయని చెప్పారు. ఎయిర్పోర్ట్ అలాగే ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ మేరకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారాయన. పేషెంట్లలో కొందరికి తగిలిన గాయాలు ఇన్ఫెక్షన్కి గురయినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







