షరతులు న్యాయబద్ధవైనవి అమలుచేయదగనివి
- June 24, 2017
సౌదీ అరేబియా : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు పలు అరబ్బు దేశాలు ముందుకొచ్చాయి. అరబ్బు దేశాల్లో ఒంటరిగా మారిన ఖతర్కు దౌత్యసంబంధాలను కొనసాగించేందుకు ఆంక్షలు విధించిన దేశాలు ఓ అవకాశాన్ని ఇచ్చాయి. 13 నిబంధనలతో కూడిన ఓ లేఖకు విడుదల చేశాయి. 10 రోజుల గడువులోగా లేఖలో పేర్కొన్న షరత్తులకు ఖతర్ ఒప్పుకుంటే బంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా దేశాలు పేర్కొన్నాయి. షరతులలో ముఖ్యమైనవి.. ఇరాన్తో ఖతర్ దౌత్యసంబంధాలను తెంచుకోవాలని, ఖతర్లోని టర్కీ మిలిటరీ క్యాంపును వెంటనే తొలగించాలనేవి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అల్-ఖైదా, ఐసిస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు ఖతర్ సహకారం అందించకూడదని, ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు 13 డిమాండ్లతో కూడిన లేఖను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కువైట్.. ఖతర్కు అందించింది. 10 రోజుల గడువులోగా షరత్తులకు ఒప్పుకుంటే దౌత్యబంధాలను పునరుద్ధరిస్తామని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని సౌదీఅరేబియా, ఈజిప్ట్, యూఏఈ, బహ్రైన్ దేశాలు ఈ లేఖలో పేర్కొన్నాయి. ఇదిలావుండగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న సంస్థలకు అండగా నిలుస్తున్న ఖతర్తో కొద్దిరోజుల క్రితం పలు అరబ్బు దేశాలు దౌత్యసంబంధాలను తెంచుకున్నాయి. కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో ఖతర్ ఒంటరిగా మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









