షరతులు న్యాయబద్ధవైనవి అమలుచేయదగనివి
- June 24, 2017
సౌదీ అరేబియా : గల్ఫ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు పలు అరబ్బు దేశాలు ముందుకొచ్చాయి. అరబ్బు దేశాల్లో ఒంటరిగా మారిన ఖతర్కు దౌత్యసంబంధాలను కొనసాగించేందుకు ఆంక్షలు విధించిన దేశాలు ఓ అవకాశాన్ని ఇచ్చాయి. 13 నిబంధనలతో కూడిన ఓ లేఖకు విడుదల చేశాయి. 10 రోజుల గడువులోగా లేఖలో పేర్కొన్న షరత్తులకు ఖతర్ ఒప్పుకుంటే బంధాలు పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా దేశాలు పేర్కొన్నాయి. షరతులలో ముఖ్యమైనవి.. ఇరాన్తో ఖతర్ దౌత్యసంబంధాలను తెంచుకోవాలని, ఖతర్లోని టర్కీ మిలిటరీ క్యాంపును వెంటనే తొలగించాలనేవి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అల్-ఖైదా, ఐసిస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు ఖతర్ సహకారం అందించకూడదని, ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు 13 డిమాండ్లతో కూడిన లేఖను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కువైట్.. ఖతర్కు అందించింది. 10 రోజుల గడువులోగా షరత్తులకు ఒప్పుకుంటే దౌత్యబంధాలను పునరుద్ధరిస్తామని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని సౌదీఅరేబియా, ఈజిప్ట్, యూఏఈ, బహ్రైన్ దేశాలు ఈ లేఖలో పేర్కొన్నాయి. ఇదిలావుండగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న సంస్థలకు అండగా నిలుస్తున్న ఖతర్తో కొద్దిరోజుల క్రితం పలు అరబ్బు దేశాలు దౌత్యసంబంధాలను తెంచుకున్నాయి. కఠినమైన ఆంక్షలు విధించాయి. దీంతో ఖతర్ ఒంటరిగా మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







