'రెండు రెళ్ళు ఆరు' పాటలు విడుదల
- June 24, 2017
హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన 'రెండు రెళ్ళు ఆరు' సినిమా విడుదలై చూస్తుండగానే మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు అదే పేరుతో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వారాహి చలన చిత్ర పతాకంపై భారీ చిత్రాలతో పాటు బడ్జెట్ మూవీస్నూ సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అంతేకాదు... వేరే వారు నిర్మించిన సినిమా తన మనసుకు నచ్చితే దానిని విడుదల చేయడానికీ ఆయన సిద్ధమౌతుంటారు. తాజాగా ప్రదీప్ చంద్ర, మోహన్ సంయుక్తంగా నిర్మించిన 'రెండు రెళ్ళు ఆరు' అనే చిత్రానికి సాయి కొర్రపాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నందు మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిల్, మహిమ జంటగా నటించారు. విజయ్బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. రాజమౌళి తొలి సీడీ ఆవిష్కరించి కీరవాణికి అందించారు.
'రెండు రెళ్ళు ఆరు' చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా దర్శకుడు నందు మల్లెల తెరకెక్కించారు. పాటలకు చక్కని స్వరాలు అందించే అవకాశం తనకు లభించిందని, జీవన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని సంగీత దర్శకుడు విజయ్ చెప్పారు. హృదయానికి హత్తుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. తన గురువు జంధ్యాల రూపొందించిన 'రెండు రెళ్ళు ఆరు' సినిమా పేరుతో ఇంతకాలానికి మరో సినిమా రావడం పట్ల సీనియర్ నటుడు నరేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట









