'రెండు రెళ్ళు ఆరు' పాటలు విడుదల
- June 24, 2017
హాస్యబ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన 'రెండు రెళ్ళు ఆరు' సినిమా విడుదలై చూస్తుండగానే మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు అదే పేరుతో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వారాహి చలన చిత్ర పతాకంపై భారీ చిత్రాలతో పాటు బడ్జెట్ మూవీస్నూ సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అంతేకాదు... వేరే వారు నిర్మించిన సినిమా తన మనసుకు నచ్చితే దానిని విడుదల చేయడానికీ ఆయన సిద్ధమౌతుంటారు. తాజాగా ప్రదీప్ చంద్ర, మోహన్ సంయుక్తంగా నిర్మించిన 'రెండు రెళ్ళు ఆరు' అనే చిత్రానికి సాయి కొర్రపాటి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నందు మల్లెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనిల్, మహిమ జంటగా నటించారు. విజయ్బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది. రాజమౌళి తొలి సీడీ ఆవిష్కరించి కీరవాణికి అందించారు.
'రెండు రెళ్ళు ఆరు' చిత్రాన్ని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా దర్శకుడు నందు మల్లెల తెరకెక్కించారు. పాటలకు చక్కని స్వరాలు అందించే అవకాశం తనకు లభించిందని, జీవన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారని సంగీత దర్శకుడు విజయ్ చెప్పారు. హృదయానికి హత్తుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. తన గురువు జంధ్యాల రూపొందించిన 'రెండు రెళ్ళు ఆరు' సినిమా పేరుతో ఇంతకాలానికి మరో సినిమా రావడం పట్ల సీనియర్ నటుడు నరేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









