బ్రిటన్ పార్లమెంటు కంప్యూటర్ నెట్వర్క్పై సైబర్ దాడి
- June 24, 2017బ్రిటన్ పార్లమెంటుకు సంబంధించిన కంప్యూటర్ నెట్వర్క్పై సైబర్ దాడి జరిగింది. శుక్రవారం రాత్రి తమ అధికారిక పార్లమెంటు ఈమెయిల్ ఖాతాలను తెరవలేకపోయామని పలువురు ఎంపీలు తెలిపారు. యూజర్ల ఖతాల్లో ప్రవేశించడానికి హ్యాకర్లు యత్నించినట్లు గుర్తించామని దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు.
నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్తో కలసి తమ కంప్యూటర్ నెట్వర్క్ భద్రతను పెంచుతున్నామని చెప్పారు. బలహీనమైన పాస్వర్డ్లను గుర్తించేందుకు హ్యాకర్లు అన్ని ఖాతాలపైనా దాడికి దిగినట్లు పార్లమెంట్ డిజిటల్ సర్వీసుల బృందం సమాచారం అందజేసింది. బ్రిటన్ ఎంపీలు, అధికారుల పాస్వర్డ్లను హ్యాకర్లు ఆన్లైన్లో అమ్ముతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సైబర్ దాడి జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?