పాకిస్తాన్లో రక్తసిక్తం: మూడుచోట్ల పేలుళ్లు, 80 మంది వరకు మృతి
- June 24, 2017
పాకిస్తాన్లో రక్తం చిందింది. రంజాన్ పండుగ సందర్భంగా ఆహ్లాదంగా ఉన్న మార్కెట్లో, ఐజీ కార్యాలయం వద్ద గస్తీలో ఉన్న పోలీసులపైనా, రహదారి పక్కనున్న రెస్టారెంట్లోని జనం లక్ష్యంగా బాంబు పేలుళ్లు, కాల్పులు చోటు చేసుకున్నాయి.
రెండు నగరాలలో జరిగిన పేలుళ్లు, మరో సిటీలో జరిగిన కాల్పులలో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
షియాలు ఎక్కువగా ఉండే కుర్రమ్ ట్రైబల్ రీజియన్లోని పరాచినార్లో పండుగ షాపింగ్ చేస్తున్న జనంతో రద్దీగా ఉన్న తురి మార్కెట్ వద్ద జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
ఈ బాంబు దాడిలో 45 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. మరోవైపు బెలూచిస్థాన్ ప్రావిన్స్లో క్వెట్టాలోని ఐజీ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక్కడ ఏడుగురు పోలీసులు సహా 13 మంది ప్రాణాలు కోలోయారు.
ఆ తర్వాత శనివారం సాయంత్రం కరాచీలోని రహదారి పక్కనున్న రెస్టారెంట్ వద్ద ఇద్దరు అగంతకులు కాల్పులకు దిగారు. ముఖాలకు హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్న పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, తామే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు లష్కర్ ఈ జాంగ్వీ ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









