లోహాల ఫ్యాక్టరీ వద్ద అంగారాలో అగ్నిప్రమాదం
- June 25, 2017
అంగారా: రాజధానికి పశ్చిమాన ఉన్న పారిశ్రామికవేత్త జిల్లాలోని అంగారాలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఉన్న లోహాల ఫ్యాక్టరీ వద్ద పాత సామానులు పడవేసి చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.అక్కడ ఉన్న పలు లోహాలు పెద్ద శబ్దంతో పేలడం ప్రారంభమయ్యింది. అంగారాతో సహా జహ్రా, సులైబికాత్, ఫర్వానీయాలతో కూడిన నాలుగు అగ్నిమాపక విభాగాలు అగ్నిమాపక యంత్రాంగాలు సంఘటనాస్థలం వద్దకు చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్ర యత్నాలు చేశారు.1,000 చదరపు మీటర్ల వ్యాసార్ధంలో లోహాల ఫ్యాక్టరీ లో విస్తరించిన అగ్నిని నియంత్రించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నిమాపక దళాలు దాదాపు మూడు గంటలు డంప అవుట్లో ఎగిసిపడుతున్న మంటలతో పోరాడాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, యూత్ వ్యవహారాల సహాయ మంత్రి ఖలేద్ అల్-రౌదన్, ఇండస్ట్రీ కోసం పబ్లిక్ అధారిటీ జనరల్ డైరెక్టర్ అబ్దుల్కరిమ్ తక్కి ప్రమాద స్థలానికి హాజరయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు ఏర్పడలేదు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







