రేపే భారత్ దేశంలో ఈద్ ఉల్ ఫితర్
- June 25, 2017
ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని రేపు జరుపుకోనున్నారు. ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్ను సోమవారం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. గత నెలరోజులుగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో గంగా జమున తెహజీబ్ సంస్కృతి ప్రతిబింబించేలా పండగ జరుపుకోవాలని ఆయన ఆకాక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి తీసుకువచ్చిన శుభసమయాన్ని ముస్లింలు పండుగలా నిర్వహించుకోవటం సంతోషమన్నారు. సత్ప్రవర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు సదా అనుసరణీయమని సీఎం అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









