రేపే భారత్ దేశంలో ఈద్ ఉల్ ఫితర్

- June 25, 2017 , by Maagulf
రేపే భారత్ దేశంలో ఈద్ ఉల్ ఫితర్

ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినాన్ని రేపు జరుపుకోనున్నారు. ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్ను సోమవారం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. గత నెలరోజులుగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మతసామరస్యం, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో గంగా జమున తెహజీబ్ సంస్కృతి ప్రతిబింబించేలా పండగ జరుపుకోవాలని ఆయన ఆకాక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి తీసుకువచ్చిన శుభసమయాన్ని ముస్లింలు పండుగలా నిర్వహించుకోవటం సంతోషమన్నారు. సత్ప్రవర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు సదా అనుసరణీయమని సీఎం అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com