మిస్‌ ఇండియాగా మానుషి ఛిల్లార్‌

- June 26, 2017 , by Maagulf
మిస్‌ ఇండియాగా మానుషి ఛిల్లార్‌

ఈ ఏడాది మిస్‌ ఇండియాగా కిరీటం హరియాణాకు చెందిన మానుషి ఛిల్లార్‌ సొంతం చేసుకుంది. 54వ ఫెమినా మిస్‌ ఇండియా పోటీలు ముంబయిలో ఘనంగా జరిగాయి. యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో జరిగిన ఈ పోటిలలో. పలు రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు.
ఈ పోటీలకు మిస్‌ వరల్డ్‌ 2016 స్టిఫానీ డెల్‌ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. బాలీవుడ్‌ ప్రముఖులు రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు.
ఈ పోటిలో మిస్‌ ఇండియా 2017గా మానుషి ఎంపిక కాగా.. తొలి రన్నరప్‌గా జమ్ముకశ్మీర్‌కు చెందిన సనా దువా, రెండో రన్నరప్‌గా బిహార్‌కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com