తొలిసారి ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ముస్లీంలకు ఇఫ్తార్ విందు
- June 26, 2017
ఉడుపి: ఉడుపి మఠం చరిత్రలోనే తొలిసారిగా పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ ఇఫ్తార్ విందు ఇచ్చారు. శనివారం సాయంత్రం మఠం ప్రాంగణంలోని అన్నబ్రహ్మ సత్రంలో ముస్లిం సోదరులకు ఖర్జూరాల్ని అందచేసి ఉపవాస దీక్షలను విరమింప చేశారు.
అనంతరం వారికి ఇఫ్తార్ విందు ఇచ్చారు. దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం మధ్వాచార్యుడు శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించిన అనంతరం తొలిసారిగా విశ్వేశతీర్థ ఇఫ్తార్ విందు ఇవ్వడం గమనార్హం.
పంక్తి భోజనంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు వడ్డనను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. వారితో కాసేపు ముచ్చటించారు.
ఈ విందులో దాదాపు 150 మంది ముస్లీం సోదరులు పాల్గొన్నారు. విందుకు వచ్చిన వారు సాయంత్రం గం.6.59 నిమిషాలకు తమ దీక్ష విరమించారు. అరటి, పుచ్చకాయ, యాపిల్, కాషూ నట్స్ తదితరాలను విందులో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు









