ఇలా చేస్తే అసిడిటీ దూరం..
- June 26, 2017
మానవ జీవితంలో పెరిగిన వేగం కారణంగా కలుగుతున్న ఒత్తిడి, ఆహార నియమాలు పాటించక పోవడం, ఎంతమాత్రం శారీరక శ్రమలేని జీవనశైలి వంటి అనేక కారణాలతో వచ్చే జీర్ణక్రియ సమస్యల్లో అసిడిటీ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యను చాలా మంది వేధిస్తోంది. ఛాతిలో మంట, పుల్లటి తేన్పులు, గొంతులో ఏదో అడ్డంపడినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే ఇది అసిడిటీ అని భావించాల్సిందే. అయితే, దీనినుంచి దూరంగా ఉండాలంటే ఇలా చేస్తే acidity సరిపోతుంది.
* రాత్రి పడుకునే ముందు, నిద్ర నుంచి లేచిన వెంటనే గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి.
* రోజూ అరటిపండు తీసుకోవాలి.
* చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి. లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి.
* రాత్రి గ్లాసు నీళ్ళకు చెంసా సోంపు కలిసి వేడిచేసుకుని ఉదయాన్ని చెంచా తేనెతో కలిసి తీసుకుంటే చాలు.
అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...
* సరిగా నిద్ర లేకపోవడం.
* ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
* ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
* ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.
* అధిక బరువును కలిగివుండటం.
* సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









