తెలంగాణ యువతి సింధుజా రెడ్డి..యూఎస్లో ఖ్యాతి
- June 27, 2017
ఆట పట్ల మక్కువ.. అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని ని రూపించిన తెలంగాణ అమ్మాయి సల్గుతి సింధుజా రెడ్డి అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో స్కాట్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ అమెరికా సత్తా చూపితే తాను 2020లో జరిగే టీ20 ప్రపం చకప్లోనూ ఆడగలనన్న ఆశాభావం సింధుజారెడ్డి వ్యక్తంజేసింది. నల్గొండ జిల్లా ఆమన్గల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల సింధుజారెడ్డి హైదరాబాద్లో ప్రాథమిక విద్యతోపాటు, బీటెక్ చదివింది. 12 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించిన ఆమె.. 14 ఏళ్లపాటు హైదరాబాద్ అండర్-16, అండర్-19 జట్లకు కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్ఉమన్గా ప్రాతినిధ్యం వహించింది. 2008లో అండర్-19 జాతీయ జట్టుకు ఆడింది. తొలుత విజయ్కుమార్ వద్ద ఆపై భారత జట్టు మాజీ కెప్టెన్ పూర్ణిమారావు వద్ద శిక్షణ పొందింది. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయిన ఆమె కొద్దికాలం తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ చేతపట్టింది.
లోకల్ క్లబ్ మ్యాచ్ల్లో సత్తా చూపి జాతీయ జట్టు సెలెక్షన్ ట్రయల్స్కు ఎంపికైంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









