తెలంగాణ యువతి సింధుజా రెడ్డి..యూఎస్లో ఖ్యాతి
- June 27, 2017
ఆట పట్ల మక్కువ.. అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని ని రూపించిన తెలంగాణ అమ్మాయి సల్గుతి సింధుజా రెడ్డి అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో స్కాట్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ అమెరికా సత్తా చూపితే తాను 2020లో జరిగే టీ20 ప్రపం చకప్లోనూ ఆడగలనన్న ఆశాభావం సింధుజారెడ్డి వ్యక్తంజేసింది. నల్గొండ జిల్లా ఆమన్గల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల సింధుజారెడ్డి హైదరాబాద్లో ప్రాథమిక విద్యతోపాటు, బీటెక్ చదివింది. 12 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించిన ఆమె.. 14 ఏళ్లపాటు హైదరాబాద్ అండర్-16, అండర్-19 జట్లకు కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్ఉమన్గా ప్రాతినిధ్యం వహించింది. 2008లో అండర్-19 జాతీయ జట్టుకు ఆడింది. తొలుత విజయ్కుమార్ వద్ద ఆపై భారత జట్టు మాజీ కెప్టెన్ పూర్ణిమారావు వద్ద శిక్షణ పొందింది. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయిన ఆమె కొద్దికాలం తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ చేతపట్టింది.
లోకల్ క్లబ్ మ్యాచ్ల్లో సత్తా చూపి జాతీయ జట్టు సెలెక్షన్ ట్రయల్స్కు ఎంపికైంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









