తెలంగాణ యువతి సింధుజా రెడ్డి..యూఎస్లో ఖ్యాతి
- June 27, 2017
ఆట పట్ల మక్కువ.. అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని ని రూపించిన తెలంగాణ అమ్మాయి సల్గుతి సింధుజా రెడ్డి అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆగస్టులో స్కాట్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ అమెరికా సత్తా చూపితే తాను 2020లో జరిగే టీ20 ప్రపం చకప్లోనూ ఆడగలనన్న ఆశాభావం సింధుజారెడ్డి వ్యక్తంజేసింది. నల్గొండ జిల్లా ఆమన్గల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల సింధుజారెడ్డి హైదరాబాద్లో ప్రాథమిక విద్యతోపాటు, బీటెక్ చదివింది. 12 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించిన ఆమె.. 14 ఏళ్లపాటు హైదరాబాద్ అండర్-16, అండర్-19 జట్లకు కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్ఉమన్గా ప్రాతినిధ్యం వహించింది. 2008లో అండర్-19 జాతీయ జట్టుకు ఆడింది. తొలుత విజయ్కుమార్ వద్ద ఆపై భారత జట్టు మాజీ కెప్టెన్ పూర్ణిమారావు వద్ద శిక్షణ పొందింది. వివాహం అనంతరం అమెరికా వెళ్లిపోయిన ఆమె కొద్దికాలం తర్వాత మళ్లీ క్రికెట్ బ్యాట్ చేతపట్టింది.
లోకల్ క్లబ్ మ్యాచ్ల్లో సత్తా చూపి జాతీయ జట్టు సెలెక్షన్ ట్రయల్స్కు ఎంపికైంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







