ప్రధాని అమెరికా పర్యటనలో చర్చకు రాని హెచ్-1బీ వీసా
- June 27, 2017
భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాల్లో హెచ్-1బీ వీసా ఒకటి. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రంప్తో భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ అంశం ఏదీ చర్చకు రాకపోవడం గమనార్హం. శ్వేత సౌధానికి అధిపతి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో వీసా భయం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వస్తుందని అందరూ భావించారు.
ఈ చర్చల్లో హెచ్-1బీ వీసాకు సంబంధించిన అంశమేదీ చర్చకు రాలేదని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ మీడియాకు వెల్లడించారు. డిజిటల్ భాగస్వామ్యం అంశం గురించి ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ట్రంప్, మోదీ భేటీ అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలోనూ హెచ్-1బీ వీసా అంశం గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







