ప్రధాని అమెరికా పర్యటనలో చర్చకు రాని హెచ్-1బీ వీసా
- June 27, 2017
భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాల్లో హెచ్-1బీ వీసా ఒకటి. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రంప్తో భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ అంశం ఏదీ చర్చకు రాకపోవడం గమనార్హం. శ్వేత సౌధానికి అధిపతి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో వీసా భయం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వస్తుందని అందరూ భావించారు.
ఈ చర్చల్లో హెచ్-1బీ వీసాకు సంబంధించిన అంశమేదీ చర్చకు రాలేదని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ మీడియాకు వెల్లడించారు. డిజిటల్ భాగస్వామ్యం అంశం గురించి ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ట్రంప్, మోదీ భేటీ అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలోనూ హెచ్-1బీ వీసా అంశం గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









