ప్రధాని అమెరికా పర్యటనలో చర్చకు రాని హెచ్-1బీ వీసా
- June 27, 2017
భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపే ప్రధాన అంశాల్లో హెచ్-1బీ వీసా ఒకటి. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రంప్తో భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ అంశం ఏదీ చర్చకు రాకపోవడం గమనార్హం. శ్వేత సౌధానికి అధిపతి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో వీసా భయం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వస్తుందని అందరూ భావించారు.
ఈ చర్చల్లో హెచ్-1బీ వీసాకు సంబంధించిన అంశమేదీ చర్చకు రాలేదని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ మీడియాకు వెల్లడించారు. డిజిటల్ భాగస్వామ్యం అంశం గురించి ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని చెప్పారు. ట్రంప్, మోదీ భేటీ అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలోనూ హెచ్-1బీ వీసా అంశం గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









