పోలీసులపై అల్లర్లు, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష
- June 28, 2017
మనామ: కజకనాన్ లో పోలీసులపై అల్లర్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. పోలీసు అధికారులపై వీరు వేధింపులకు పాల్పడ్డారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 22 వ తేదీన15 మంది అల్లరిమూకలు హింసకు పాల్పడ్డారు. ఒక రహదారిని నిర్బంధించి రోడ్లపై టైర్లను ఫైర్ బాంబులతో దహనం చేశారు. అంతేకాక ఇద్దరు ఇనుప కడ్డీలు చేతబూని పోలీసులపై దాడి చేశారు. దాడి చేస్తున్న అల్లరిమూకలను పోలీసులు ఎట్టకేలకు అడ్డుకున్నారు .అయినప్పటికీ, ఆ సన్నివేశంలో పోలీసు అధికారులు ముద్దాయిలకు భయపడి పారిపోకుండా నిరోధించగలిగారు. అల్లర్ల కు పాల్పడిన నిందితుల వేలిముద్రలను సేకరించి ఆ నమూనాలతో సరిపోల్చడం ద్వారా ఆయా నేరాలలో వారి పాత్రను ధృవీకరించబడింది. వారి కార్యసాధనను వివరిస్తూ, ముద్దాయిలలో ఒకరు పోలీసులకు ఇలా చెప్పాడు: "నేను షాబాబ్ కజ్రాజాకన్ (కజాకన్ యూత్) అనే పేరు గల వాట్సాప్ సమూహంపై ఒక సందేశాన్ని అందుకున్నాను, అల్లర్లకు పాల్పడవల్సిందిగా సమాచారం వచ్చింది. ఇందుకోసం 3:30 గంటలకు సమావేశం కావాలని కోరుతూ అందులో పేర్కొన్నారు. " నేను సమావేశం స్థలంకు చేరుకున్నాను. మేము టైర్లను రోడ్లపైకి చేర్చడం మొదలుపెట్టాము తరువాత పోలీసు అధికారులపై దాడి చేసాము "అని మొదటి ప్రతివాది చెప్పారు. "మేము దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ , ఈ ఘటనలో మేము దొరికిపోయామని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







