పోలీసులపై అల్లర్లు, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష
- June 28, 2017
మనామ: కజకనాన్ లో పోలీసులపై అల్లర్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. పోలీసు అధికారులపై వీరు వేధింపులకు పాల్పడ్డారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 22 వ తేదీన15 మంది అల్లరిమూకలు హింసకు పాల్పడ్డారు. ఒక రహదారిని నిర్బంధించి రోడ్లపై టైర్లను ఫైర్ బాంబులతో దహనం చేశారు. అంతేకాక ఇద్దరు ఇనుప కడ్డీలు చేతబూని పోలీసులపై దాడి చేశారు. దాడి చేస్తున్న అల్లరిమూకలను పోలీసులు ఎట్టకేలకు అడ్డుకున్నారు .అయినప్పటికీ, ఆ సన్నివేశంలో పోలీసు అధికారులు ముద్దాయిలకు భయపడి పారిపోకుండా నిరోధించగలిగారు. అల్లర్ల కు పాల్పడిన నిందితుల వేలిముద్రలను సేకరించి ఆ నమూనాలతో సరిపోల్చడం ద్వారా ఆయా నేరాలలో వారి పాత్రను ధృవీకరించబడింది. వారి కార్యసాధనను వివరిస్తూ, ముద్దాయిలలో ఒకరు పోలీసులకు ఇలా చెప్పాడు: "నేను షాబాబ్ కజ్రాజాకన్ (కజాకన్ యూత్) అనే పేరు గల వాట్సాప్ సమూహంపై ఒక సందేశాన్ని అందుకున్నాను, అల్లర్లకు పాల్పడవల్సిందిగా సమాచారం వచ్చింది. ఇందుకోసం 3:30 గంటలకు సమావేశం కావాలని కోరుతూ అందులో పేర్కొన్నారు. " నేను సమావేశం స్థలంకు చేరుకున్నాను. మేము టైర్లను రోడ్లపైకి చేర్చడం మొదలుపెట్టాము తరువాత పోలీసు అధికారులపై దాడి చేసాము "అని మొదటి ప్రతివాది చెప్పారు. "మేము దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ , ఈ ఘటనలో మేము దొరికిపోయామని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









