పోలీసులపై అల్లర్లు, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష
- June 28, 2017
మనామ: కజకనాన్ లో పోలీసులపై అల్లర్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. పోలీసు అధికారులపై వీరు వేధింపులకు పాల్పడ్డారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి 22 వ తేదీన15 మంది అల్లరిమూకలు హింసకు పాల్పడ్డారు. ఒక రహదారిని నిర్బంధించి రోడ్లపై టైర్లను ఫైర్ బాంబులతో దహనం చేశారు. అంతేకాక ఇద్దరు ఇనుప కడ్డీలు చేతబూని పోలీసులపై దాడి చేశారు. దాడి చేస్తున్న అల్లరిమూకలను పోలీసులు ఎట్టకేలకు అడ్డుకున్నారు .అయినప్పటికీ, ఆ సన్నివేశంలో పోలీసు అధికారులు ముద్దాయిలకు భయపడి పారిపోకుండా నిరోధించగలిగారు. అల్లర్ల కు పాల్పడిన నిందితుల వేలిముద్రలను సేకరించి ఆ నమూనాలతో సరిపోల్చడం ద్వారా ఆయా నేరాలలో వారి పాత్రను ధృవీకరించబడింది. వారి కార్యసాధనను వివరిస్తూ, ముద్దాయిలలో ఒకరు పోలీసులకు ఇలా చెప్పాడు: "నేను షాబాబ్ కజ్రాజాకన్ (కజాకన్ యూత్) అనే పేరు గల వాట్సాప్ సమూహంపై ఒక సందేశాన్ని అందుకున్నాను, అల్లర్లకు పాల్పడవల్సిందిగా సమాచారం వచ్చింది. ఇందుకోసం 3:30 గంటలకు సమావేశం కావాలని కోరుతూ అందులో పేర్కొన్నారు. " నేను సమావేశం స్థలంకు చేరుకున్నాను. మేము టైర్లను రోడ్లపైకి చేర్చడం మొదలుపెట్టాము తరువాత పోలీసు అధికారులపై దాడి చేసాము "అని మొదటి ప్రతివాది చెప్పారు. "మేము దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ , ఈ ఘటనలో మేము దొరికిపోయామని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









