సముద్రంలో గల్లంతయిన వ్యక్తి మృతదేహం వెలికితీత
- June 28, 2017
ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసేసింది. సముద్రంలో ఈతకు వెళ్ళిన ఓ వ్యక్తి, ఈత కొడుతూ సముద్రంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. తీర ప్రాంతమంతటా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు, ఎట్టకేలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. మృతుడ్ని ఈజిప్టుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కమ్యూనిటీ మెంబర్స్, సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయినట్లు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఈద్ తొలి రోజున సముద్రంలో ఈత కొట్టాలన్న సరదా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







