అల్ జజైర్ బీచ్లో భారతీయుడి మునక
- June 28, 2017
మనామా: అల్ జజైర్ బీచ్లో భారతీయ వలసదారుడొకరు మునిగిపోయారు. అల్ఫాజర్ గ్యారేజ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న జస్పాల్ సింగ్గా ఆ వ్యక్తిని గుర్తించారు. జస్పాల్ సింగ్ మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో అన్ని అనుమానాలకూ నివృత్తి దొరికే అవకాశం ఉంది. భారతదేశంలోని జస్పాల్ సింగ్ కుటుంబానికి ఆయన మరణం గురించి తెలియజేశామని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్విట్టర్లో వెల్లడించింది. జూన్ 27న ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. భారతీయ వలసదారుడు కబీస్ అబ్దుల్ జలీల్ అనే వ్యక్తి జుఫ్ఫైర్లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







