అల్ జజైర్ బీచ్లో భారతీయుడి మునక
- June 28, 2017
మనామా: అల్ జజైర్ బీచ్లో భారతీయ వలసదారుడొకరు మునిగిపోయారు. అల్ఫాజర్ గ్యారేజ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న జస్పాల్ సింగ్గా ఆ వ్యక్తిని గుర్తించారు. జస్పాల్ సింగ్ మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో అన్ని అనుమానాలకూ నివృత్తి దొరికే అవకాశం ఉంది. భారతదేశంలోని జస్పాల్ సింగ్ కుటుంబానికి ఆయన మరణం గురించి తెలియజేశామని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్విట్టర్లో వెల్లడించింది. జూన్ 27న ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. భారతీయ వలసదారుడు కబీస్ అబ్దుల్ జలీల్ అనే వ్యక్తి జుఫ్ఫైర్లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







