అబుదాబీలో కొత్త ట్రాఫిక్ జరీమానాలు
- June 29, 2017
జులై 1 నుంచి కొత్త ట్రాఫిక్ జరీమానాలు అమల్లోకి రానున్నాయి. ఫెడరల్ ట్రాఫిక్ లా 21కి సంబంధించి జరిగిన అమెండ్మెంట్స్ నేపథ్యంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహనదారులు ఆయా నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడంలో వాహనదారులదే కీలక పాత్ర అని చెప్పారు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. కొత్త జరీమానాలు, కొత్త రూల్స్కి సంబంధించి వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారాయన. సిగ్నల్స్ని లెక్క చేయని వాహనదారులకు, సీట్ బెల్ట్ పెట్టుకోని వాహనదారులకు, కార్ విండో గ్లాస్ టింట్ చేసి ఉన్నందుకు ఇలా రకరకాలైన ఉల్లంఘనలకు కఠినంగా జరీమానాలు విధిస్తారు. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ పట్ల మరింత కఠినంగా కొరడా ఝుళిపించనున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









