అబుదాబీలో కొత్త ట్రాఫిక్ జరీమానాలు
- June 29, 2017
జులై 1 నుంచి కొత్త ట్రాఫిక్ జరీమానాలు అమల్లోకి రానున్నాయి. ఫెడరల్ ట్రాఫిక్ లా 21కి సంబంధించి జరిగిన అమెండ్మెంట్స్ నేపథ్యంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహనదారులు ఆయా నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడంలో వాహనదారులదే కీలక పాత్ర అని చెప్పారు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. కొత్త జరీమానాలు, కొత్త రూల్స్కి సంబంధించి వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారాయన. సిగ్నల్స్ని లెక్క చేయని వాహనదారులకు, సీట్ బెల్ట్ పెట్టుకోని వాహనదారులకు, కార్ విండో గ్లాస్ టింట్ చేసి ఉన్నందుకు ఇలా రకరకాలైన ఉల్లంఘనలకు కఠినంగా జరీమానాలు విధిస్తారు. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ పట్ల మరింత కఠినంగా కొరడా ఝుళిపించనున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







