తెలంగాణ ప్రజా సమితి నూతన కార్యవర్గ ఏర్పాటు మరియు ఇఫ్తార్
- June 29, 2017

దోహ, కతర్: పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని , తెలంగాణ ప్రజా సమితి , కతర్ జూన్ 22, 2017 న హైదరాబాద్ ప్యాలెస్ హోటల్లో వార్షిక ఇఫ్తార్ నిర్వహించింది. ఈ కార్యక్రమనికి ఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి మిలన్ అరుణ్ గారు, ఐసిసి మెంబర్షిప్ చైర్మన్ శ్రీ ప్రసాద్ రావు కొడూరి గారు అతిధులుగా హాజరయ్యారు.
అతిథులు సమావేశానికి తమ ప్రత్యేకమైన రంజాన్ సందేశాన్ని తెలియజేశారు మరియు సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రజా సమితి , కతర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎన్నికైన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిచయ కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు శ్రీ శ్రీధర్ అబ్బగౌని, వైస్ ప్రెసిడెంట్ శ్రీ భానుప్రకాష్ పెద్దపల్లి, జనరల్ సెక్రటరీ శ్రీ కె. రాజేశ్వర్ రావు, శ్రీ అంజయ్య వాట్టంల జె.టి. జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ శ్రీ శ్రీనివాస్ కొత్తపల్లి ల తో పాటు అన్ని ఇతర కార్యనిర్వాహక కమిటీ బృందాలను పరిచయం చేసారు. అనంతరం కొత్త కమిటీ తమ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసింది.
ఈ సంధర్భంగా అతిథులకు ప్రత్యేక హైదరాబాద్ వంటకాల తో విందు ను ఏర్పాటు చేయడం జరిగింది.


తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







