అసిడిటీ కి కొన్ని చిట్కాలు
- June 29, 2017
మామిడి పండు, పుచ్చకాయలలో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎసిడిటీ స్థాయిని తగ్గించడంలో ఆపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత ఒక ఆపిల్ తింటే ఎసిడిటీ రాకుండా నివారిస్తుంది. బంగాళదుంపలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఇది ఎసిడిటీని నియంత్రిస్తుంది. ఉడకబెట్టిన బంగాళదుంప మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇకపోతే.. ఉల్లికాడలు ఎసిడిటీని తగ్గిస్తాయి. ఇందులో ఉన్న పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎసిడిటీని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. ఆకు కూరలలో ఉండే ఎంజైములు, క్లోరోఫిల్ కడుపులోని ఎసిడిటీని నియంత్రిస్తాయి. గుండెలో మంటగా ఉన్నప్పుడు తాజా నిమ్మ, ఆరెంజ్, నారింజ, పైనాపిల్, క్యారెట్, గుమ్మడి, దోస, సొర కాయరసాలు తాగితే ఎసిడీటీ లేదా గుండెల్లో వచ్చే మంట తగ్గుతుంది.
భోజనం చేసే అరగంట, 40 నిమిషాల ముందు గోరు వెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం పిండి తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగా జరగడమే కాక నిమ్మలో ఉండే పొటాషియం ఆమ్లాలను సమతులం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









