పేలిన పెట్రోల్ ట్యాంక్, 194 మంది మృతి
- June 30, 2017
పాకిస్థాన్లోని లాహోర్లో పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 194కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో చాలామందికి 60 నుంచి 100శాతం వరకు కాలిన గాయాలయ్యాయని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే వీరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
కరాచీ నుంచి లాహోర్కు 50వేల లీటర్లతో వెళ్తున్న ఓ పెట్రోల్ ట్యాంకర్ ఆదివారం ఉదయం బహావాల్పూర్ జిల్లా అహ్మద్పూర్ షర్కియా ప్రాంతంలో బోల్తా కొట్టింది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ విరజిమ్మడం గమనించిన స్థానికులు.. క్యాన్లు, బకెట్లు పట్టుకుని అక్కడికి వెళ్లారు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ అంటించడంతో క్షణాల్లో మంటలు చెలరేగి.. ట్యాంకర్ పేలిపోయింది.
ప్రమాదం ధాటికి 151 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 140మంది వరకు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో చాలామంది శరీరం పూర్తిగా కాలిపోయిందని అధికారులు చెప్పారు.
చికిత్స పొందుతూ మరో 43 మంది మృతిచెందారు. మృతులంతా అగ్నికి పూర్తిగా ఆహుతవడంతో గుర్తించడానికి వీలులేకుండా పోయింది. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







