పేలిన పెట్రోల్ ట్యాంక్, 194 మంది మృతి
- June 30, 2017
పాకిస్థాన్లోని లాహోర్లో పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 194కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో చాలామందికి 60 నుంచి 100శాతం వరకు కాలిన గాయాలయ్యాయని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంబంధిత అధికారులు ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే వీరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
కరాచీ నుంచి లాహోర్కు 50వేల లీటర్లతో వెళ్తున్న ఓ పెట్రోల్ ట్యాంకర్ ఆదివారం ఉదయం బహావాల్పూర్ జిల్లా అహ్మద్పూర్ షర్కియా ప్రాంతంలో బోల్తా కొట్టింది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ విరజిమ్మడం గమనించిన స్థానికులు.. క్యాన్లు, బకెట్లు పట్టుకుని అక్కడికి వెళ్లారు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ అంటించడంతో క్షణాల్లో మంటలు చెలరేగి.. ట్యాంకర్ పేలిపోయింది.
ప్రమాదం ధాటికి 151 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 140మంది వరకు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో చాలామంది శరీరం పూర్తిగా కాలిపోయిందని అధికారులు చెప్పారు.
చికిత్స పొందుతూ మరో 43 మంది మృతిచెందారు. మృతులంతా అగ్నికి పూర్తిగా ఆహుతవడంతో గుర్తించడానికి వీలులేకుండా పోయింది. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









