విమాన కేబిన్ లో పొగలు
- June 30, 2017
బిహార్లోని పట్నా విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం క్యాబిన్లో నుంచి పొగలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తొలుత టేకాఫ్ సమయంలో విమానం టైర్లు పేలిపోయిన కారణంగా విమానాన్ని ఆపినట్లు అంతా అనుకున్నారు. కానీ క్యాబిన్లో నుంచి మంటలు రావడం వల్లే విమానాన్ని నిలిపివేసినట్టు ఇండిగో అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై డీజీసీఏకు తెలియజేశామని, విచారణ జరుగుతోందని విమాన సంస్థ తెలిపింది.
రన్వేపై విమానాన్ని నిలిచిపోవడం వల్ల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం కారణంగా భాజపా నేత సుశీల్కుమార్ మోదీ, కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్, ఇతర భాజపా నేతలు విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయారు. రన్వేపై విమానం ఉండటం వల్ల భాజపా నేతలు వెళ్లాల్సిన విమానం అలస్యమయింది. పార్లమెంటులో జరిగే జీఎస్టీ ఆరంభ వేడుకలకు ఈ నేతలందరూ హాజరయ్యేందుకు దిల్లీ పయనమయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









