విమాన కేబిన్ లో పొగలు
- June 30, 2017
బిహార్లోని పట్నా విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం క్యాబిన్లో నుంచి పొగలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తొలుత టేకాఫ్ సమయంలో విమానం టైర్లు పేలిపోయిన కారణంగా విమానాన్ని ఆపినట్లు అంతా అనుకున్నారు. కానీ క్యాబిన్లో నుంచి మంటలు రావడం వల్లే విమానాన్ని నిలిపివేసినట్టు ఇండిగో అధికారులు స్పష్టం చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై డీజీసీఏకు తెలియజేశామని, విచారణ జరుగుతోందని విమాన సంస్థ తెలిపింది.
రన్వేపై విమానాన్ని నిలిచిపోవడం వల్ల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం కారణంగా భాజపా నేత సుశీల్కుమార్ మోదీ, కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్, ఇతర భాజపా నేతలు విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయారు. రన్వేపై విమానం ఉండటం వల్ల భాజపా నేతలు వెళ్లాల్సిన విమానం అలస్యమయింది. పార్లమెంటులో జరిగే జీఎస్టీ ఆరంభ వేడుకలకు ఈ నేతలందరూ హాజరయ్యేందుకు దిల్లీ పయనమయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి









