రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా ఈ-ఆధార్ కు ఓకే

- June 30, 2017 , by Maagulf
రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా ఈ-ఆధార్ కు ఓకే

రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా చూపడానికి ఇకమీదట ఈ-ఆధార్ ప్రింటింగ్ కాపీనీ అనుమతించనున్నారు. ఈమేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ఒరిజినల్ ఆధార్ను మాత్రమే ఇందుకోసం అనుమతించేవారు. ప్రస్తుతం ఆస్థానంలో ఈ-ఆధార్కూ అవకాశం కల్పించారు. వీటితోపాటు ఎన్నికల గుర్తింపుకార్డు, పాస్పోర్టు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు (సీరియల్ నెంబర్ ఉండాలి), పాఠశాలలు, కాలేజీలు జారీచేసిన విద్యార్థి గుర్తింపుకార్డులు, జాతీయ బ్యాంకుల పాస్బుక్కులు (ఫొటోతోసహా), ల్యామినేటెడ్ బ్యాంకు క్రెడిట్కార్డులు, రేషన్కార్డులను గుర్తింపుకార్డులుగా అనుమతిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com