రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా ఈ-ఆధార్ కు ఓకే
- June 30, 2017
రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా చూపడానికి ఇకమీదట ఈ-ఆధార్ ప్రింటింగ్ కాపీనీ అనుమతించనున్నారు. ఈమేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ఒరిజినల్ ఆధార్ను మాత్రమే ఇందుకోసం అనుమతించేవారు. ప్రస్తుతం ఆస్థానంలో ఈ-ఆధార్కూ అవకాశం కల్పించారు. వీటితోపాటు ఎన్నికల గుర్తింపుకార్డు, పాస్పోర్టు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు (సీరియల్ నెంబర్ ఉండాలి), పాఠశాలలు, కాలేజీలు జారీచేసిన విద్యార్థి గుర్తింపుకార్డులు, జాతీయ బ్యాంకుల పాస్బుక్కులు (ఫొటోతోసహా), ల్యామినేటెడ్ బ్యాంకు క్రెడిట్కార్డులు, రేషన్కార్డులను గుర్తింపుకార్డులుగా అనుమతిస్తారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







