అమెరికా న్యూజెర్సీలో మరో 'షిరిడీ'
- July 03, 2017షిరిడీలో సాయిబాబా మహా సంస్థానం మాదిరి ఆలయం అమెరికాలోని న్యూజెర్సీలోనూ ఏర్పాటు కానుంది. విజయవాడలోని స్టెల్లా కళాశాల వద్ద సాయిబాబా ఆలయంలో ప్రధానార్చకుడిగా పనిచేసిన గుంటూరు జిల్లాకు చెందిన శంకరమంచి రవిశర్మ.. ఆయన కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లారు. న్యూజెర్సీలోని సాయిబాబా ఆలయంలో పనిచేసిన రవిశర్మ అక్కడ షిరిడీలోని బాబా ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. షిరిడీలో ఉన్నట్టుగా ఆలయాన్ని, గోశాలను, చావడి, ద్వారకామాయి, కల్యాణ మండపం, శివాలయం, గురుకుల వేదశాలను నిర్మించడానికి రూ.100కోట్లు వ్యయమవుతుంది. దీన్ని ఒక్కో భక్తుడి నుంచి రూ.713.99ల చొప్పున (11 డాలర్లు) చొప్పున 1,111,111మంది భక్తుల ఇళ్లలో సాయిబాబా పాదుకలతో పూజ నిర్వహించి అవసరమైన విరాళాన్ని సేకరించారు. విజయదశమి రోజున భూమి పూజ చేయాలని నిర్ణయించామని తెలిపారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!