ప్రవాసాంధ్రులకూ ధీమా!
- July 03, 2017
''విదేశాలకు వెళ్లారు. బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. జన్మభూమికి ఏదో ఒకటి చేయండి''... అమెరికాలోనో, మరో దేశంలోనో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడిన వారికి ప్రభుత్వం ఇచ్చే పిలుపు ఇది! మరి... గల్ఫ్ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారి సంక్షేమంపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వారు కూడా రాష్ట్రంలో నివసిస్తున్న వారిగానే భావిస్తూ... వారి సంక్షేమానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నారు. 2016లో ఏర్పాటు చేసిన నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎన్ఆర్టీ) సంస్థ చైర్మన్ రవికుమార్, సీఈవో కె.సాంబశివరావు గల్ఫ్ బాధితులను ఆదుకోవడంపై ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన సమన్వయకర్తల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఇవీ ఆ వివరాలు...
ఇప్పటికే గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు, వెళ్లబోయేవారు తప్పనిసరిగా ఎన్ఆర్టీ వద్ద పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలి. వారికి వెంటనే ఒక నంబరును ఇస్తారు. భవిష్యత్లో ఈ నంబరుతోనే ఎన్ఆర్టీతో సంప్రదింపులు జరపవచ్చు.
రాష్ట్రంలో వారికి అల్పాదాయ వర్గాల వారికి అందిస్తున్న తెల్ల రేషన్ కార్డు రద్దు చేయాలంటూ ఎలాంటి ప్రతిపాదనలూ చేయరు. పైగా.. రాష్ట్రంలో నివసిస్తోన్న తెలుగువారి తరహాలోనే ప్రవాసాంధ్రుల హక్కులు కాపాడతారు.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చంద్రన్న బీమా తరహాలో.. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నవారికి ప్రత్యేక బీమా అమలు చేస్తారు.
గల్ఫ్ దేశాల్లో నివసిస్తోన్న ప్రవాసాంధ్రులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందుతుందో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకుని ఆ వివరాలన్నీ ప్రవాసాలకు అందుబాటులోకి తెస్తారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









