ఇజ్రాయెల్ చేరుకున్నమోదీ
- July 04, 2017
టెల్అవివ్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆయన రాక సందర్భంగా ప్రత్యేక ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. ఎర్రతివాచీ పరిచి మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు ప్రధాని మోదీకి స్వాగతం పలికి ఆహ్వానించారు. క్రైస్తవ మత ప్రధాన గురువు పోప్, అమెరికా దేశాధ్యక్షుడికి మాత్రమే దక్కే ప్రత్యేకమైన స్వాగతం అందుకున్న తదుపరి వ్యక్తి మోదీ కావడం విశేషం. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమంలో ఇరు దేశాధ్యక్షులూ మీడియాతో మాట్లాడనున్నారు. మోదీ రాక సందర్భంగా నేతన్యాహు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇజ్రాయెలీ పౌరులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 'భారత ప్రధాని రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పర్యటన ఇరు దేశాలకు మేలు చేకూరుస్తుంది'.. అని వారు అభిప్రాయపడుతున్నారు.
భారత్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 25ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు. కీలక, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం ఆయన పర్యాటక ప్రధాన ఉద్దేశం.
తాజా వార్తలు
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!









