బర్గర్లు, పిజ్జాలతో మతిమరుపు?
- July 04, 2017
ప్రస్తుతం చాలా మంది తీసుకుంటున్న బర్గర్, పిజ్జా, ఎరుపు మాంసం కారణంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని ఎలుకల మీద వీరు ఆరు నెలల పాటు పరిశోధన నిర్వహించారు. వీటికి ప్రతిరోజూ బర్గర్లు, పిజ్జాలతో పాటు ఎర్రమాంసంతో తయారు చేసిన ఆహారాన్ని ఇచ్చారు. ఆరు నెలల తరువాత వీటిని పరిశీలించగా, వీటి బరువులో అనూహ్యమైన మార్పులు రావడంతో పాటు వాటి కదలికలలో, రుచి వాసన కనిపెట్టడం లాంటి విషయాలలో మార్పును గమనించారు. అధిక క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన ఎలుకల్లో చురుకుదనం నశించిదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది బర్గర్లు, పిజ్జాలు తినడానికే ఇష్టపడుతున్నారనీ, వీటిని తీసుకోవడం వలన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం అధికబరువు ఒక్కటేననీ, అయితే దీర్ఘకాలంలో వీరిలో జ్ఞాపకశక్తి నశించే అవకాశాలు ఎక్కువ అని వారు అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







