ట్రక్ ప్రమాదంలో గుర్రపు బండి ధ్వంసం
- July 05, 2017
అసలే...అవి చల్ ..చల్ చలాకీ గుర్రాలు ....జట్కా తో సహా వాటిని ట్రక్కు లోపలకు ఎక్కించారు... కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ గుర్రాలకు ఉషారు వచ్చింది.. ట్రక్కు లోపల పరుగులు పెట్టేందుకు బలంగా ప్రయత్నించాయి...దీంతో ఒక్కసారిగా ట్రక్కు ఒడిదుడుకులకు లోనయ్యింది. ఈ ఆకస్మిక పరిణామానికి ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. నడి రోడ్డుపై ట్రక్కు బోల్తాపడింది..గుర్రపు బండి నుజ్జు నుజ్జు కాబడింది. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5:15 గంటలకు సల్మాబాద్ నుంచి మనామకు వెళ్లే దారిలో సీఫ్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. " ఈ ట్రక్కు లోపల రెండు గుర్రాలు ఉన్నాయి..అవి గుర్రపు బండికి జత చేయబడి ఉన్నాయి. ట్రక్కు లోపల గడిబిడి చేసిన గుర్రాల కారణంగా ట్రక్కుఅదుపు కోల్పోయి బోల్తా కొట్టిందని..ఆ ఘటనలో గుర్రపు బండి పాడైందని " ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









