ట్రక్ ప్రమాదంలో గుర్రపు బండి ధ్వంసం
- July 05, 2017
అసలే...అవి చల్ ..చల్ చలాకీ గుర్రాలు ....జట్కా తో సహా వాటిని ట్రక్కు లోపలకు ఎక్కించారు... కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ గుర్రాలకు ఉషారు వచ్చింది.. ట్రక్కు లోపల పరుగులు పెట్టేందుకు బలంగా ప్రయత్నించాయి...దీంతో ఒక్కసారిగా ట్రక్కు ఒడిదుడుకులకు లోనయ్యింది. ఈ ఆకస్మిక పరిణామానికి ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. నడి రోడ్డుపై ట్రక్కు బోల్తాపడింది..గుర్రపు బండి నుజ్జు నుజ్జు కాబడింది. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5:15 గంటలకు సల్మాబాద్ నుంచి మనామకు వెళ్లే దారిలో సీఫ్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. " ఈ ట్రక్కు లోపల రెండు గుర్రాలు ఉన్నాయి..అవి గుర్రపు బండికి జత చేయబడి ఉన్నాయి. ట్రక్కు లోపల గడిబిడి చేసిన గుర్రాల కారణంగా ట్రక్కుఅదుపు కోల్పోయి బోల్తా కొట్టిందని..ఆ ఘటనలో గుర్రపు బండి పాడైందని " ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









