ట్రక్ ప్రమాదంలో గుర్రపు బండి ధ్వంసం
- July 05, 2017
అసలే...అవి చల్ ..చల్ చలాకీ గుర్రాలు ....జట్కా తో సహా వాటిని ట్రక్కు లోపలకు ఎక్కించారు... కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ గుర్రాలకు ఉషారు వచ్చింది.. ట్రక్కు లోపల పరుగులు పెట్టేందుకు బలంగా ప్రయత్నించాయి...దీంతో ఒక్కసారిగా ట్రక్కు ఒడిదుడుకులకు లోనయ్యింది. ఈ ఆకస్మిక పరిణామానికి ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. నడి రోడ్డుపై ట్రక్కు బోల్తాపడింది..గుర్రపు బండి నుజ్జు నుజ్జు కాబడింది. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5:15 గంటలకు సల్మాబాద్ నుంచి మనామకు వెళ్లే దారిలో సీఫ్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. " ఈ ట్రక్కు లోపల రెండు గుర్రాలు ఉన్నాయి..అవి గుర్రపు బండికి జత చేయబడి ఉన్నాయి. ట్రక్కు లోపల గడిబిడి చేసిన గుర్రాల కారణంగా ట్రక్కుఅదుపు కోల్పోయి బోల్తా కొట్టిందని..ఆ ఘటనలో గుర్రపు బండి పాడైందని " ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







