ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో..భారత మహిళల జట్టు జైత్రయాత్ర

- July 05, 2017 , by Maagulf
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో..భారత మహిళల జట్టు జైత్రయాత్ర

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు అదరగొతున్నారు. భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలోఓటమి లేకుండా సాగుతున్న భారత్‌ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది.
233 టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంకను భారత్‌ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో జులన్‌ గోస్వామి, పూనమ్‌ యాదవ్‌ రెండేసి, డీబీ శర్మ, బిస్త్‌ చెరో వికెట్‌ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ(78), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (53) అర్థశతకాలతో రాణించడంతో భారత్‌ మెరుగైన స్కోర్‌ సాధించగలిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com