సినిమా ప్రియులకు షాక్ ఇవ్వనున్న ఏపీ.. టికెట్స్ ధర పెంపు

- July 06, 2017 , by Maagulf
సినిమా ప్రియులకు షాక్ ఇవ్వనున్న ఏపీ.. టికెట్స్ ధర పెంపు

వినోదం కోసం సినిమాలకు వెళ్దాం అంటే టికెట్ ధరలు షాక్ కొట్టేటట్లు వున్నాయి.. ఇప్పటికే తమిళనాడు లో థియేటర్లు టికెట్ ధరను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సమ్మె చేస్తున్న సంగతి విధితమే.. కాగా తాజాగా ఏపీలోని సినిమా టికెట్స్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్ లో రిక్లయినర్ సీట్లకు రూ.300, మిగిలిన టికెట్స్ ధర రూ.200 గా ఉండనున్నాయి.. మిగిలిన థియేటర్ల టికెట్ ధర టికెట్ ధర, జీఎస్టీ పన్ను కలిపితే.. రూ.118 అవుతుంది.. ఈ మేరకు గత కొద్ది రోజుల క్రితమే ఆర్ధక, హోమ్, రెవెన్యూ శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు సమావేశమయ్యారు. టిక్కెట్‌ ధరల పెంపుపై చర్చించారు. ఈ క్రమంలో త్వరలోనే టికెట్ల ధరల పెంపునకు సంబందించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో రిలాక్స్ కోసం సినిమానే సాధనంగా చేసుకొన్న సామాన్యుడు టికెట్ పెంపుతో వినోదం కూడా భారంగా మారింది.. అని చెప్పవచ్చు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com