సినిమా ప్రియులకు షాక్ ఇవ్వనున్న ఏపీ.. టికెట్స్ ధర పెంపు
- July 06, 2017
వినోదం కోసం సినిమాలకు వెళ్దాం అంటే టికెట్ ధరలు షాక్ కొట్టేటట్లు వున్నాయి.. ఇప్పటికే తమిళనాడు లో థియేటర్లు టికెట్ ధరను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సమ్మె చేస్తున్న సంగతి విధితమే.. కాగా తాజాగా ఏపీలోని సినిమా టికెట్స్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మల్టీ ప్లెక్స్ లో రిక్లయినర్ సీట్లకు రూ.300, మిగిలిన టికెట్స్ ధర రూ.200 గా ఉండనున్నాయి.. మిగిలిన థియేటర్ల టికెట్ ధర టికెట్ ధర, జీఎస్టీ పన్ను కలిపితే.. రూ.118 అవుతుంది.. ఈ మేరకు గత కొద్ది రోజుల క్రితమే ఆర్ధక, హోమ్, రెవెన్యూ శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు సమావేశమయ్యారు. టిక్కెట్ ధరల పెంపుపై చర్చించారు. ఈ క్రమంలో త్వరలోనే టికెట్ల ధరల పెంపునకు సంబందించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో రిలాక్స్ కోసం సినిమానే సాధనంగా చేసుకొన్న సామాన్యుడు టికెట్ పెంపుతో వినోదం కూడా భారంగా మారింది.. అని చెప్పవచ్చు..
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







