కూలిన శిక్షణ హెలికాప్టర్.. పైలట్లు సురక్షితం

- July 06, 2017 , by Maagulf
కూలిన  శిక్షణ హెలికాప్టర్.. పైలట్లు సురక్షితం

 భారత వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ హెలికాప్టర్ గురువారం రాజస్థాన్లో కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు అందులోని పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఎయిర్ఫోర్స్కు చెందిన మైజీ-23 శిక్షణ హెలికాప్టర్ గురువారం ఉదయం జోధ్పూర్ జిల్లాలోని బాలేసర్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే హెలికాప్టర్ ఎలా కూలిందన్న దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ మంగళవారం నుంచి కనబడకుండా పోయింది. అరుణాచల్ప్రదేశ్లోని పపుమ్పరే జిల్లాలో గల సగలీకు సమీపాన ప్రయాణం ఆరంభించిన కొద్ది సమయానికే హెలికాప్టర్ నుంచి సంకేతాలు అందకుండా పోయాయి. ఇందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కాగా..

ఈ విమానానికి సంబంధించిన శకలాలను న్యోర్చు నదీ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతదేహాలను గుర్తించగా.. మరో సిబ్బంది మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com