కూలిన శిక్షణ హెలికాప్టర్.. పైలట్లు సురక్షితం
- July 06, 2017
భారత వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ హెలికాప్టర్ గురువారం రాజస్థాన్లో కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు అందులోని పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఎయిర్ఫోర్స్కు చెందిన మైజీ-23 శిక్షణ హెలికాప్టర్ గురువారం ఉదయం జోధ్పూర్ జిల్లాలోని బాలేసర్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే హెలికాప్టర్ ఎలా కూలిందన్న దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ మంగళవారం నుంచి కనబడకుండా పోయింది. అరుణాచల్ప్రదేశ్లోని పపుమ్పరే జిల్లాలో గల సగలీకు సమీపాన ప్రయాణం ఆరంభించిన కొద్ది సమయానికే హెలికాప్టర్ నుంచి సంకేతాలు అందకుండా పోయాయి. ఇందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కాగా..
ఈ విమానానికి సంబంధించిన శకలాలను న్యోర్చు నదీ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతదేహాలను గుర్తించగా.. మరో సిబ్బంది మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









