కూలిన శిక్షణ హెలికాప్టర్.. పైలట్లు సురక్షితం
- July 06, 2017
భారత వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ హెలికాప్టర్ గురువారం రాజస్థాన్లో కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు అందులోని పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఎయిర్ఫోర్స్కు చెందిన మైజీ-23 శిక్షణ హెలికాప్టర్ గురువారం ఉదయం జోధ్పూర్ జిల్లాలోని బాలేసర్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే హెలికాప్టర్ ఎలా కూలిందన్న దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ మంగళవారం నుంచి కనబడకుండా పోయింది. అరుణాచల్ప్రదేశ్లోని పపుమ్పరే జిల్లాలో గల సగలీకు సమీపాన ప్రయాణం ఆరంభించిన కొద్ది సమయానికే హెలికాప్టర్ నుంచి సంకేతాలు అందకుండా పోయాయి. ఇందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కాగా..
ఈ విమానానికి సంబంధించిన శకలాలను న్యోర్చు నదీ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతదేహాలను గుర్తించగా.. మరో సిబ్బంది మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







