భారత్ ఖాతాలో తొలి స్వర్ణం
- July 06, 2017
ఒడిశాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ భారత్ తొలి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన వుమెన్స్ షాట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ స్వర్ణపతకాన్ని సాధించింది. పురుషుల షాట్పుట్లో వికాస్ గౌడ కాంస్య పతకాన్ని సాధించాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 44 దేశాలకు చెందిన 800 మందికి పైగా అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 95 మంది అథ్లెట్లు(49 మంది పురుషులు, 46 మంది మహిళలు) ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు భారత్ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిచ్చింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









