ఇజ్రాయెల్ టూర్ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీ
- July 06, 2017
భారత ప్రధాని నరేంద్ర మోడీ .. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగిసింది. చివరిరోజు కూడా ప్రధాని వెన్నంటే ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్. హైఫాలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు మోడీ. అనంతరం.. ఓల్గా బీచ్కు వెళ్లి. . సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే వాహనాన్ని పరిశీలించారు. నీటి సంరక్షణ, గంగా ప్రక్షాళన, నీటి నిర్వహణలో పరస్పర సహకారంపై రెండు దేశాలు ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ వాహనంలో మోడిని ఎక్కించుకుని.. బెంజమిన్ స్వయంగా డ్రైవ్ చేస్తూ బీచ్లో తిప్పారు. ఆ తర్వాత ఓ టెక్నాలజీ ఎగ్జిబిషన్ను సందర్శించారు మోడీ. అక్కడి కొత్త టెక్నాలజీల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగించుకున్న ప్రధాని.. అక్కడి నుంచి జర్మనీలోని హాంబర్గ్కు వెళ్లారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









