ఇజ్రాయెల్ టూర్ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీ
- July 06, 2017
భారత ప్రధాని నరేంద్ర మోడీ .. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగిసింది. చివరిరోజు కూడా ప్రధాని వెన్నంటే ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్. హైఫాలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు మోడీ. అనంతరం.. ఓల్గా బీచ్కు వెళ్లి. . సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే వాహనాన్ని పరిశీలించారు. నీటి సంరక్షణ, గంగా ప్రక్షాళన, నీటి నిర్వహణలో పరస్పర సహకారంపై రెండు దేశాలు ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ వాహనంలో మోడిని ఎక్కించుకుని.. బెంజమిన్ స్వయంగా డ్రైవ్ చేస్తూ బీచ్లో తిప్పారు. ఆ తర్వాత ఓ టెక్నాలజీ ఎగ్జిబిషన్ను సందర్శించారు మోడీ. అక్కడి కొత్త టెక్నాలజీల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగించుకున్న ప్రధాని.. అక్కడి నుంచి జర్మనీలోని హాంబర్గ్కు వెళ్లారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







