సీజనల్ పుట్టుగొడుగులు... తింటే ఏంటి లాభం?
- July 06, 2017
సీజనల్గా వచ్చే కూరగాయలను తింటూ వుంటే ఆరోగ్యవంతులుగా వుంటారు. వర్షా కాలం వచ్చిందంటే పల్లెల్లో పుట్టుగొడుగులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. ఈ కాలంలో వాటిని కూరవండుకుని తినడం గ్రామీణులకు మామూలే. ప్రతి సీజన్లో ఆయా కూరలు, ఆకు తింటుంటారు. ఇది సహజం. అందుకే పల్లెల్లో చాలామంది ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్ని వారికి పకృతి ప్రసాదించిన వరమే. ఇందులో భాగమే పుట్టుగొడుగులు.
పుట్టగొడులు గురించి అమెరికా పరిశోధకులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అమెరికా ఆహార, ఔషధ పాలనా విబాగం పరిశోధనలు సత్ఫలితాలనే ఇచ్చాయి. అతినీలలోహిత కిరణాల కింద పంపిన పుట్టగొడుగులను ఆరబెట్టితే ఇందులో డి విటమిన్ను దాచుకునే దక్షత కనిపిస్తోందని చెపుతున్నారు. పైగా పుట్టుగొడుగులు తినడం వలన బోలు ఎముకల వ్యాధి నుంచి ఉపశమనం దొరుకుతుంది. హృద్రోగం, చక్కెర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ను అడ్డుకునే శక్తి దీనికి వుందని తేలింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







