3-1 తేడాతో విండీస్తో వన్డే సిరీస్ భారత్ కైవసం
- July 06, 2017
కరీబియన్ గడ్డపై టీమ్ఇండియా అదరహో అనిపించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో సమష్టిగా సత్తాచాటి తమకు తిరుగులేదని నిరూపించింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన హోల్డర్ సేన చివరిదైన ఐదో వన్డేలో పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది. గత మ్యాచ్లో లాగే ఛేదనలో భారత్ను కట్టడి చేసి సిరీస్ను సమం చేయాలనుకున్న విండీస్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి అజేయ శతకం ముందు తేలిపోయింది. కింగ్స్టన్లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్.. మహ్మద్ షమీ... ఉమేశ్ యాదవ్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం స్టార్ క్రికెటర్ విరాట్ శతకం, దినేశ్ కార్తిక్ అర్ధశతకంతో రాణించడంతో భారత్ 36.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







