3-1 తేడాతో విండీస్తో వన్డే సిరీస్ భారత్ కైవసం
- July 06, 2017
కరీబియన్ గడ్డపై టీమ్ఇండియా అదరహో అనిపించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో సమష్టిగా సత్తాచాటి తమకు తిరుగులేదని నిరూపించింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన హోల్డర్ సేన చివరిదైన ఐదో వన్డేలో పోరాట పటిమ ప్రదర్శించలేకపోయింది. గత మ్యాచ్లో లాగే ఛేదనలో భారత్ను కట్టడి చేసి సిరీస్ను సమం చేయాలనుకున్న విండీస్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి అజేయ శతకం ముందు తేలిపోయింది. కింగ్స్టన్లో జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్పై 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. ఐదో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్.. మహ్మద్ షమీ... ఉమేశ్ యాదవ్ విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం స్టార్ క్రికెటర్ విరాట్ శతకం, దినేశ్ కార్తిక్ అర్ధశతకంతో రాణించడంతో భారత్ 36.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









