గోల్డ్ బాండ్స్ కొత్త ఇష్యూ జూలై 10న
- July 06, 2017
సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీము కింద ప్రభుత్వం జూలై 10న మలివిడత గోల్డ్ బాండ్ల ఇష్యూను ప్రారంభించనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి గోల్డ్ బాండ్ల ఇష్యూ. ఈ ఇష్యూకు దరఖాస్తులు జూలై10–14 తేదీల మధ్య స్వీకరిస్తామని, బాండ్లను జూలై 28న జారీచేస్తామని గురువారం విడుదలైన ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది.
ఒక గ్రాము బంగారానికి సమానంగా ఒక బాండు జారీఅవుతుంది. ఈ బాండ్లలో కనీస పెట్టుబడి ఒక గ్రాముకాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాములకు సమానమైన బాండ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. 8 సంవత్సరాల కాలపరిమితితో జారీచేసే ఈ బాండ్లపై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.2015 నవంబర్లో ఈ స్కీమును ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ 8 దఫాలు పుత్తడి బాండ్లను జారీచేసి, రూ. 5,400 కోట్లు సమీకరించారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









