ఉపాధ్యాయురాలికి యునైటెడ్ ఎయిర్లైన్స్ క్షమాపణలు తెలిపింది

- July 08, 2017 , by Maagulf
ఉపాధ్యాయురాలికి యునైటెడ్ ఎయిర్లైన్స్ క్షమాపణలు తెలిపింది

ఒక హవాయి ఉపాధ్యాయురాలికి యునైటెడ్ ఎయిర్లైన్స్ క్షమాపణ చెప్పింది,  ఆమె తన 2 ఏళ్ల కుమారుడికి సైతం విమానం టికెట్ ని కొనినప్పటకీ ఆ బాలునికి సీటు కేటాయించనందున  మూడున్నర గంటలపాటు చిన్నారిని తన వళ్ళో కూర్చోపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ మహిళ కొనుగోలు చేసే సీటును విమాన ఉద్యోగి వేరేవారికి కేటాయించడంతో ఆమె ఇబ్బంది ఎదుర్కొంది . షిర్లీ యమూచి అనబడే ఆ మహిళ రెండు టికెట్లు కొనుగోలు చేసింది. ఒక్కో టికెట్ కు 1,000 డాలర్లు చెల్లించారు.ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు తమ సొంత సీటును కలిగి ఉండాలనే నిబంధనను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ఆమె హూస్టన్ లో  తన కుమారుడు టైయిజ్ తో విమానంలోకి వెళ్లారు. వారు తమకు కేటాయించబడిన సీట్లలో కూర్చొన్నారు.  కాపోలీ మిడిల్ స్కూల్ టీచర్ తన కుమారుడు తైజో హాజరు కావడంతో విమాన సిబ్బంది ఒకరు అక్కడకు వచ్చి ,పసిపిల్లల సీట్ నంబర్ తో టికెట్ వచ్చారని విమానం ప్రయాణికులతో నిండుగా ఉన్నందున  వేరేవారు ఆ సీట్ లో  కూర్చొంటారని ఆమెకు చెప్పారు. దాంతో ఆమె చేసేదేమి లేక పిల్లవాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రయాణం పోర్ర్తీచేసేంది. ఈ సంఘటన జరిగిన  ఐదు రోజుల తరువాత విమాన సంస్థ ఆమెకు క్షమాపణ చెబుతూ ఒక లేఖ జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com