భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
- July 08, 2017
హైదరాబాద్లో మరో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ ప్యాకెట్లు, 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ ప్రాంతంలో మత్తుమందు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఆఫ్రికన్ దేశస్తుడు కాగా.. మరో ఇద్దరు స్థానికులు. డ్రగ్స్ కేసులోఇప్పటికే అరెస్టైన ముఠాతో వీరికి సంబంధాలు లేవని సమచారం. ప్రధాన నిందితుడు నైజీరియన్ బెర్నార్డ్ విల్సన్పై గతంలోనూ డ్రగ్స్ కేసు నమోదైంది. డిమాండ్ పెరుగుతున్న కొద్ది డ్రగ్స్ రేటు పెంచుతుంటారని పోలీసులు తెలిపారు. నిందితులు స్టార్ హోటళ్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







