భారతదేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు

- July 09, 2017 , by Maagulf
భారతదేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు

ఇక గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సాయి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు సాయి ఆలయాలకు  పోటెత్తారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఢిల్లీలో గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురుపూజోత్సవం సందర్భంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయాల ముందు క్యూ కట్టారు.

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గురుపూర్ణిమ సందర్భంగా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సాయి ఆలయాలు సహా గురుదత్త పీఠం ఉన్న గుడుల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణ జిల్లా గూడూరులో శ్రీ రామ్ రతన్ జి మహారాజ్ మరియు రాజా మాత గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com