దుబాయ్ ఎయిర్పోర్ట్ హ్యాండెలర్పై దొంగతనం అభియోగం
- July 11, 2017
విమానంలోకి లగేజ్ని తీసుకెళుతున్న సమయంలో బ్యాగేజీల్లోంచి విలువైన వస్తువుల్ని అపహరిస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఎయిర్పోర్ట్ వర్కర్పై అభియోగాలు నమోదయ్యాయి. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో సోమవారం ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. 21 ఏళ్ళ నేపాలీ వ్యక్తి, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లగేజ్ని విమానాల్లోకి తరలించే కంపెనీ తరఫున పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి లగేజ్ నుంచి విలువైన వస్తువుల్ని దొంగిలిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని సన్నిహితుడికి దొంగిలించిన వస్తువుల్ని అప్పగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గోల్డ్ యాంక్లెట్, యెల్లో అండ్ బ్లాక్ గ్లోవ్స్, రేబాన్ సన్ గ్లాసెస్, 10 ఈజిపిస్టయన్ పౌండ్స్, 100 రష్యన్ రూబుల్స్ నిందితుడి దగ్గర పోలీసులు కనుగొన్నారు. వివిద రకాలైన లగేజ్ బ్యాగేజ్ నుంచి వాటిని తస్కరించినట్లుగా నిందితుడు విచారణలో అంగీకరించాడు. మూడు వాచ్లు, హెడ్ఫోన్స్, ఒక సెల్ఫోన్, ఓ ఇయర్ రింగ్, ఓ ఫోన్ ఛార్జర్ని దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకోగా, వాటిని అల్ కోజ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అతని నివాసం నుంచి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







