సౌదీ అరేబియాలో భారీ అగ్నిప్రమాదం...
- July 12, 2017
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో బుధవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నజ్రాన్ ప్రావిన్స్లోని ఓ పాత భవనంలో మంటలు చెలరేగి 11 మంది వలస కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతులంతా భారత్, బంగ్లాదేశ్కు చెందిన వలస కార్మికులే. కిటికీలు లేని ఆ ఇంట్లో వీరంతా తలదాచుకుంటున్నారని, ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయని, పొగతో ఊపిరాడక వారంతా మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రియాద్లో 90 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారనీ, వీరిలో ఎక్కువ మంది దక్షిణాయాసియా నుంచి వచ్చిన వారేనని 2015లో విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







