సౌదీ అరేబియాలో భారీ అగ్నిప్రమాదం...
- July 12, 2017
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో బుధవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నజ్రాన్ ప్రావిన్స్లోని ఓ పాత భవనంలో మంటలు చెలరేగి 11 మంది వలస కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతులంతా భారత్, బంగ్లాదేశ్కు చెందిన వలస కార్మికులే. కిటికీలు లేని ఆ ఇంట్లో వీరంతా తలదాచుకుంటున్నారని, ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయని, పొగతో ఊపిరాడక వారంతా మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రియాద్లో 90 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారనీ, వీరిలో ఎక్కువ మంది దక్షిణాయాసియా నుంచి వచ్చిన వారేనని 2015లో విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









