యూఏఈలో మండుతున్న ఎండలు
- July 14, 2017
రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరుకోవచ్చని ఎన్సిఎంఎస్ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు తీవ్రతరమవడంతోపాటుగా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందనీ, కొన్ని చోట్ల సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గాలులు ఓ మోస్తరు నుంచి సాధారణంగా ఉండొచ్చు. ధూళితో కూడిన గాలుల కారణంగా వాహనదారులకు సమస్యలు ఏర్పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న 48 గంటలపాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండవచ్చును గనుక వాహనదారులు, ప్రజలు ఒకింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. సముద్రం కొంతమేర రఫ్గా ఉండొచ్చు కాబట్టి, సముద్ర తీర ప్రాంతాల్లో సేద తీరుదామనుకునేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







