టిహబ్‌ వేదికగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌

- July 14, 2017 , by Maagulf
టిహబ్‌ వేదికగా  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆధ్వరంయలో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ సెమినార్‌ను మంత్రి కెటిఆర్‌, డ్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు.. బేంగపేటలోని ఐటిసి గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కెటిఆర్‌ మాట్లాడారు.. పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌ అనువైన స్థలమన్నారు.. కంపెనీల ఏర్పాటుకు అనువైన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు.. అలాగే ఏరోస్పేస్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో హైదరాబాద్‌ ముందు ఉందని అన్నారు. ఎన్నో రక్షణ సంస్థలు కూడ ఇక్కడ ఉన్నాయన్నారు.. టిహబ్‌ కొత్త ఆవిష్కరణకు హైదరాబాద్‌వేదికగా ఉందన్నారు.
సింగిల్‌విండో విధానం ద్వారా 15 రోజుల్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తామనిమంత్రి అన్నారు. ట్రంప్‌ హెలికాప్టర్‌ క్యాబిన్‌ కూడ ఇక్కడే తయారవుతుందని మంత్రి చెప్పారు.. 2018 మార్చిలో ఇండియన్‌ ఏవియేషన్‌ షో నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com