'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై అవగాహన సదస్సు
- July 15, 2017
రెండు రోజుల పర్యటన నిమిత్తం యుఏఈ విచ్చేసిన 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ డా||రవి కుమార్ వేమూరు కు దుబాయ్ విమానాశ్రయంలో యుఏఈ కోఆర్డినేటర్లు అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్ ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యి రవికుమార్ వేమూరు కు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం కోఆర్డినేటర్లు మాట్లాడుతూ రవి కుమార్ పర్యటనా వివరాలు ఇలా తెలిపారు. "తొలుత దుబాయ్ లోని పలు లేబర్ క్యాంపులకు వెళ్లి అక్కడి కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని తగు సూచలనాలు వారికి అందించనున్నారు. తదుపరి దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో సమావేశమై అధికారులతో 'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై చర్చించనున్నారు. అటుపై స్థానిక ప్రముఖులతో సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులకై సుదీర్ఘంగా చర్చించనున్నారు".
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







