'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై అవగాహన సదస్సు

- July 15, 2017 , by Maagulf
'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై అవగాహన సదస్సు

రెండు రోజుల పర్యటన నిమిత్తం యుఏఈ విచ్చేసిన 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ డా||రవి కుమార్ వేమూరు కు దుబాయ్ విమానాశ్రయంలో యుఏఈ కోఆర్డినేటర్లు అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్ ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యి రవికుమార్ వేమూరు కు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం కోఆర్డినేటర్లు మాట్లాడుతూ రవి కుమార్ పర్యటనా వివరాలు ఇలా తెలిపారు. "తొలుత దుబాయ్ లోని పలు లేబర్ క్యాంపులకు వెళ్లి అక్కడి కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని తగు సూచలనాలు వారికి అందించనున్నారు. తదుపరి దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో సమావేశమై అధికారులతో 'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై చర్చించనున్నారు. అటుపై స్థానిక ప్రముఖులతో సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులకై సుదీర్ఘంగా చర్చించనున్నారు".

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com