'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై అవగాహన సదస్సు
- July 15, 2017
రెండు రోజుల పర్యటన నిమిత్తం యుఏఈ విచ్చేసిన 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ డా||రవి కుమార్ వేమూరు కు దుబాయ్ విమానాశ్రయంలో యుఏఈ కోఆర్డినేటర్లు అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్ ఘన స్వాగతం పలికారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యి రవికుమార్ వేమూరు కు పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం కోఆర్డినేటర్లు మాట్లాడుతూ రవి కుమార్ పర్యటనా వివరాలు ఇలా తెలిపారు. "తొలుత దుబాయ్ లోని పలు లేబర్ క్యాంపులకు వెళ్లి అక్కడి కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని తగు సూచలనాలు వారికి అందించనున్నారు. తదుపరి దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో సమావేశమై అధికారులతో 'ఆంధ్ర ప్రదేశ్ వలస కార్మికుల సంక్షేమ మరియు అభివృద్ధి' పాలసీ పై చర్చించనున్నారు. అటుపై స్థానిక ప్రముఖులతో సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పెట్టుబడులకై సుదీర్ఘంగా చర్చించనున్నారు".
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









