గ్యాసోలైన్ రంగు మార్పు: గ్యాస్ స్టేషన్ మూసివేత
- July 15, 2017
రియాద్: రెడ్ పౌండర్ని, గ్యాసోలైన్లో మిక్స్ చేసి, తద్వారా గ్రీన్ నుంచి రెడ్ కలర్కి గ్యాసోలైన్ని మార్చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఓ గ్యాస్ స్టేషన్ని అధికారులు మూసివేశారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ ఇన్స్పెక్టర్స్ ఈ మోసాన్ని గుర్తించి, తగిన పరీక్షలు నిర్వహించి, గ్యాస్ స్టేషన్ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. 91 ఆక్టేన్ గ్యాసోలైన్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రంగు మార్చడం ద్వారా 91 ఆక్టేన్ గాసోలైన్ని 95 గాసోలైన్గా విక్రయించి అధికంగా సొమ్ము చేసుకుంటున్నారు గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు. ఓ వినియోగదారుడు అందించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు చేశారు. ఇంకో వైపున మరో వినియోగదారుడి ఫిర్యాదుతో కింగ్ ఖాలిద్ రోడ్లోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో ప్రైస్ ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









