గ్యాసోలైన్ రంగు మార్పు: గ్యాస్ స్టేషన్ మూసివేత
- July 15, 2017
రియాద్: రెడ్ పౌండర్ని, గ్యాసోలైన్లో మిక్స్ చేసి, తద్వారా గ్రీన్ నుంచి రెడ్ కలర్కి గ్యాసోలైన్ని మార్చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఓ గ్యాస్ స్టేషన్ని అధికారులు మూసివేశారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ ఇన్స్పెక్టర్స్ ఈ మోసాన్ని గుర్తించి, తగిన పరీక్షలు నిర్వహించి, గ్యాస్ స్టేషన్ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. 91 ఆక్టేన్ గ్యాసోలైన్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రంగు మార్చడం ద్వారా 91 ఆక్టేన్ గాసోలైన్ని 95 గాసోలైన్గా విక్రయించి అధికంగా సొమ్ము చేసుకుంటున్నారు గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు. ఓ వినియోగదారుడు అందించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు చేశారు. ఇంకో వైపున మరో వినియోగదారుడి ఫిర్యాదుతో కింగ్ ఖాలిద్ రోడ్లోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో ప్రైస్ ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







