గ్యాసోలైన్ రంగు మార్పు: గ్యాస్ స్టేషన్ మూసివేత
- July 15, 2017
రియాద్: రెడ్ పౌండర్ని, గ్యాసోలైన్లో మిక్స్ చేసి, తద్వారా గ్రీన్ నుంచి రెడ్ కలర్కి గ్యాసోలైన్ని మార్చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఓ గ్యాస్ స్టేషన్ని అధికారులు మూసివేశారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ ఇన్స్పెక్టర్స్ ఈ మోసాన్ని గుర్తించి, తగిన పరీక్షలు నిర్వహించి, గ్యాస్ స్టేషన్ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. 91 ఆక్టేన్ గ్యాసోలైన్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రంగు మార్చడం ద్వారా 91 ఆక్టేన్ గాసోలైన్ని 95 గాసోలైన్గా విక్రయించి అధికంగా సొమ్ము చేసుకుంటున్నారు గ్యాస్ స్టేషన్ నిర్వాహకులు. ఓ వినియోగదారుడు అందించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు చేశారు. ఇంకో వైపున మరో వినియోగదారుడి ఫిర్యాదుతో కింగ్ ఖాలిద్ రోడ్లోని ఓ ఫ్యూయల్ స్టేషన్లో ప్రైస్ ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









