హైదరాబాద్ లో 30న డ్రగ్స్కు వ్యతిరేకంగా ర్యాలీ
- July 19, 2017
కళామందిర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద ఈ నెల 30న డ్రగ్స్కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కళామందిర్ కల్యాణ్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున సబర్వాల్తో కలిసి ఆయన బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ డ్రగ్స్ సంస్కృతి పాఠశాలలకు కూడా పాకడం బాధాకరమని అన్నారు. ఎంతో భవిష్యత ఉన్న విద్యార్థులను, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తమ వంతుగా డ్రగ్స్ గురించి అందరికి అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే స్కూల్, కళాశాల విద్యార్థులతో కలిసి నిర్వహించే ఈ ర్యాలీకి అకున్ సబర్వాల్ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎదురయ్యే మానసిక, ఆరోగ్య ఇబ్బందులను తెలియచేస్తూ బుక్లెట్ కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు. హోప్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 30న ర్యాలీకి నగరవాసులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కల్యాణ్ కోరారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









