ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండి
- July 23, 2017
కువైట్ : ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తమ వెంట తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండని డైరెక్టర్ జనరల్ జమాల్ అల్-జలావీ ప్రయాణికులను కోరారు. 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తరలిస్తే , వారి రాక పోకల సమయంలో తరువాత చట్టం 106/4 ప్రకారం అధికారులకు విధిగా తెలియచేయాలని ఆయన కోరారు. . పౌరులు మరియు నివాసితులు డబ్బు తరలించడం నేరమైతే కాదు కానీ ఎంత మొత్తంలో తీసుకెళుతున్నారో తెలియచేయాలని వారి డబ్బుపై కువైట్ తరఫునుంచి ఎలాంటి పరిమితి లేదని ఆయన ప్రకటించారు. కువైట్ అక్రమనగదు బదిలీపై పోరాడటానికి కఠినమైన చట్టం అమలువుతుంది. అంతేకాక , ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేరే అపరిచితులు విమానాశ్రయాలలో తమ సామానులు కాస్తంత పట్టుకోండని అడిగితే సహాయం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. నిషేధిత పదార్ధాలను తరలించేవారు తోటి ప్రయాణికులతో ఇలా వ్యవహరిస్తారని అన్నారు. ఒకవేళ ఎవరైనా అమాయకంగా వారి సన్నులు తీసుకొంటే..పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు నేరస్తునితో పాటు ఆ ప్రయాణికుడికి శిక్ష తప్పదని అన్నారు.నిషేధిత వస్తువుల జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయాణీకులు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లేదా దాని పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ను సందర్శించాలని సిఫారసు చేసారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









