మహిళల మెడ నుండి బంగారు గొలుసు తెంచుకుపోయిన దొంగ
- July 25, 2017
రయ్ మని బైకుపై వచ్చి మహిళలల మెడ లోని బంగారు గొలుసుని తెంచుకొని రెప్పపాటులో మాయమయ్యే చైన్ స్నాచర్లు మన ప్రాంతాలలో ఆ తరహా చోరీలు మనకు విదితమే..." రాను...రాను... రాజు గారి గుర్రం.. గాడిదైనట్లు " ఆ తరహా నేరాలు గల్ఫ్ ప్రాంతాలలో మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు రాజధాని ప్రాంతంలో ఓ 36 ఏళ్ల మహిళ మెడలోని బంగారు గొలుసును తెంచుకొని దొంగ పరారయ్యాడు. మనామా లోని షిఫా సమీపంలోని అల్ జజీరా ఆసుపత్రికి సమీపంలో నివసించే సింధు అనే మహిళ మనామలోని జవద్ హౌస్ లేన్ వద్ద తన స్నేహితురాలితో కలిసి నడుస్తుంది. . "నా భార్య జవద్ హౌస్ లేన్లో తన స్నేహితురాలితో, ముగ్గురు పిల్లలు మరియు నా 7 ఏళ్ల కుమారుడితో కలిసి నడుస్తుంది. ఆమె తన తల తిప్పి సమీపంలోని ఓ దుకాణంలో ఏదో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా అకస్మాత్తుగా ఓ దొంగ సింధు మెడలోని గొలుసును లాక్కొని అక్కడ్నుంచి పారిపోయాడని సింధు భర్త మనోజ్ చెప్పారు." ఆ రాత్రి సి.సి.టి.వీ లో రికార్డ్ కాబడిన వీడియో సమాచారం సేకరించామని అందులో , నా భార్యను దాటికి ముందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఆమె తన వద్దకు వచ్చే వరకు వేచి ఉన్నాడు..ఆమె తన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసుని ఒక్క వుదుటన లాక్కొని పారిపోయాడుని తెలిపాడు. మేము పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాము మరియు పరిశోధనలు మొదలుకాబడ్డాయి. గతంలో కొన్ని నెలలు క్రితం అదే ప్రాంతంలో రజనీకాంత్ ఫిచడియా, 59, వరల్డ్ జ్యూలలర్స్ యజమాని, ఒకే స్థలంలో13,000 బెహెరిన్ దినార్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగలు దోచుకున్నారు. ఈ సంఘటన మార్చి 28 న జరిగింది. ఫిదాడియా ఆభరణాల దుకాణం తలుపు వద్ద తన కుమారుడి కోసం జావాద్ హౌస్ ఎదుట ఎదురు చూస్తుండగా, ఒక -నలుగురు దొంగల ముఠా అతడిపై దాడి చేసి, బంగారు నగలను ఎత్తుకుపోయిన సంఘటన సైతం ఇక్కడ నమోదైంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









