శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో దావూద్ సోదరి చిత్రం వాయిదా
- August 01, 2017
శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’. అపూర్వ లఖియా దర్శకుడు. ముంబయి అండర్ వరల్డ్డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 18న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
ఇదే నెలలో షారుక్ నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, అక్షయ్ కుమార్ నటించిన ‘టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథా’ చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రాన్ని వాయిదా వేయాలని దర్శకుడు అపూర్వ లఖియా నిర్ణయించారు.
ఈ విషయమై దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హసీనా’ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయాలనుకున్నాం. కానీ షారుక్, అక్షయ్ సినిమాలు కూడా అప్పుడే విడుదల అవుతున్నాయి. అందులోనూ అక్షయ్ చిత్రానికి పన్ను మినహాయింపు ఉంది. అలాంటప్పుడు మా సినిమాను విడుదల చేసి ప్రమాదం కొనితెచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









